calender_icon.png 6 September, 2025 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధన్వంతరి ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేయాలి

06-09-2025 12:55:14 AM

ప్రభుత్వానికి ధన్వంతరి అగ్రీవ్డ్ ఇన్వెస్టర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి

ముషీరాబాద్, సెప్టెంబర్ 5(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ధన్వంతరి ఇంటర్నేషనల్ సంస్థ(డిఎఎఫ్‌ఎ) ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేయాలని ధన్వంతరి అగ్రీవ్డ్ ఇన్వెస్టర్స్ అసోసియే షన్(డిఎఐ) కోరింది. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎఐ అధ్యక్షులు అన్నంరాజు నాగరాజు, మాజీ అధ్యక్షులు ఆత్రేయ శర్మ, సెక్రటరీ అచ్యుతానంద రంగారావు, వైన్ ప్రెసిడెంట్ సుసుర్ల నర్సింహ మూర్తిలు మాట్లాడారు.

బాధితులకు అనుకూలంగా నాంపల్లి ఎంఎస్ జే కోర్ట్ తీర్పు వెలువరించిందని అన్నారు. తీర్పు అనుకూలంగా రావడానికి కృషి చేసిన సీసీఎస్ డీసీపీ శ్వేతా, ఏసీపీ ఆదినారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు. సీసీఎస్ అధికారుల సలహా, సూచనల మేరకు డీఎస్‌ఐఐ సంస్థ లో పెట్టుబడి పెట్టి మోసపోయిన వివిధ సంస్థలను, వ్యక్తులను ఒక తాటిపై తీసుకొచ్చి 400 మంది సభ్యులతో ఈ అసోసియేషన్ ఏర్పడిందని వివరించారు. 1700 మంది బాధితులు 220 కోట్ల పైగా పెట్టుబడులు పెట్టి మోసపోయామని చెప్పా రు.

ఇందులో చాలా మంది వృద్ధులని పేర్కొన్నారు. ఎన్నో ప్రయాసలకోర్చి దాచుకున్న సొమ్మును అధిక వడ్డీకి ఆశపడి డీఎఫ్‌ఎలో పెట్టుబడి పెట్టి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ధన్వంతరి సం స్థ వారు బాధితులతో సామరస్య పూర్వకంగా పరిష్కార దిశగా ప్రయత్నం చేయాలని కోరారు. బాధితులకు మూల ధనంతోపాటు వడ్డీ సొమ్ము చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.