16-06-2025 11:25:05 PM
తహసిల్దార్, ఏసీపి హామీలతో ధర్నా విరమణ..!
దళిత సంఘాల నాయకులు..
హనుమకొండ (విజయక్రాంతి): భూకబ్జాదారులైన బండి కుమారస్వామి, తాళ్ల మల్లేశం, పులి రంజిత్ రెడ్డిల ఆగడాలకు బలైపోయిన పోలెపాక కుమారస్వామి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన శవంతో దళిత సంఘాల నాయకులు కలకోటి మహేందర్, సంఘి ఏలేందర్, మాదాసి సురేష్ ఆధ్వర్యంలో వరంగల్ నాయుడు పెట్రోల్ పంపు జంక్షన్ వద్ద ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న మిల్స్ కాలనీ సీఐ బొల్లం రమేష్, మామునూరు సిఐ ఒంటేరు రమేష్ లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న దళిత నాయకులను ఎంత చెప్పినా వినకుండా ఆందోళన ఉదృతం చేశారు.
వుయ్ వాంట్ జస్టిస్.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి... ఖబర్దార్ భూకబ్జాదారుల్లారా...అని నిలదీస్తూ జిల్లా కలెక్టర్ తో పాటు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన ఉదృతం చేశారు. పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉండడంతో సమాచారం తెలుసుకున్న వరంగల్ ఏసీపి నందిరాం నాయక్, ఖిలా వరంగల్ తహసిల్దార్ బండి నాగేశ్వరావు వచ్చి ఆందోళనకారులను శాంతింపజేసి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో దళిత, ప్రజాసంఘాల సంఘాల నాయకులు బస్కే నాగరాజు, జన్ను అనిల్ కుమార్, మంద నవీన్, కేడల ప్రసాద్, రాచర్ల బాలరాజు, వేల్పుగొండ నర్సింగరావు, పోలేపాక మల్లేశం తదితరులు పాల్గోన్నారు.