17-06-2025 12:00:00 AM
రెవల్యూషన్ యూత్ ఆధ్వర్యంలో సింగరేణి సీఎండీకి వినతిపత్రం
మందమర్రి, జూన్ 16 : సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమ నేత దివంగత ఎండి మునీర్ విగ్రహాన్ని సింగరేణి ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో పాటు, సింగరేణిలో మునీర్ పేరిట పురస్కారాలు అందజేయాలని రెవల్యూషన్ స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షుడు, జర్నలిస్ట్ అనిల్ భగత్, ఉపాధ్యక్షుడు అక్బర్ లు కోరారు.
ఈమేరకు హైదరాబాద్ లోని సింగరేణి భవనంలో సింగరేణి సిఎండి బలరాం నాయక్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సీనియర్ పాత్రికేయులు మునీర్ విగ్రహం ఏర్పాటు, అలాగే గని కార్మికులకు అందించే అవార్డులు మునీర్ పేరిట అందించాలనీ కోరారు.
సిఎండి స్పందిస్తూ మునీర్ మృతి సమాజానికి తీరని లోటని, ఆయన విగ్ర హం ఏర్పాటు కోసం త్వరలో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. బండ కింద బ్రతుకులకు బరోసా ఇచ్చిన జర్నలిస్ట్ మృతి నల్ల నేలకు తీరని లోటని, సింగరేణి చరిత్రలో ఆయన ప్రజల హృదయాల్లో సజీవంగా నిలిచి ఉంటారనీ ఆన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ప్రవీణ్, సాయి, దీపక్, జాఫర్ ఉన్నారు.