పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా
నేరేడుచర్ల నుండి తరలిన ఉపాధ్యాయులు
నేరేడుచర్ల,(విజయక్రాంతి): రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సంఘం పిలుపు మేరకు పెండింగ్ లో ఉన్న అనేక సమస్యల పరిష్కారం కోసం దశలవారీ పోరాటంలో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నా కార్యక్రమానికి నేరేడుచర్ల నుండి ఉపాధ్యాయులు తరలివెళ్లారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,రెండవ వేతన సవరణను వెంటనే అమలు చేయాలి,ఆరు కరువు భత్యాలను వెంటనే విడుదల చేయాలి.
విరాళాల ఆధారిత పింఛను విధానాన్ని రద్దు చేసి పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలి. ప్రతి నెల పదవీ విరమణ అయ్యే వారికి ఇచ్చే బకాయిలు మూడు వేల కోట్ల వరకు చెల్లించాలి. ఇరవై ఐదవ ప్రభుత్వ ఉత్తర్వును సవరించి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలి. నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని సక్రమంగా అమలు చేయాలనే తదితర సమస్యలను పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు.






