calender_icon.png 7 June, 2025 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగులు సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలి

07-06-2025 01:08:37 AM

ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ 

గద్వాల, జూన్ 6 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథ కాలను దివ్యాంగులు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బీయం సంతోష్ అన్నారు.

శుక్రవారం ఐడీఓసీ సమావేశం హాల్ నందు మహిళలు,శిశు, వయోవృద్ధులు,దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అలిమ్కో సంస్థ ద్వారా జిల్లాలోని 93 మంది దివ్యాంగులకు రూ.21.27 లక్షలతో 114 పరికరాలను కలెక్టర్ సంతోష్ తో కలిసి ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అంద జేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజంలో ప్రతి దివ్యాంగులు అభివృద్ధి చెంద డం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంమని తెలిపారు.దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం ఎప్పుడూ వినడానికి, పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వ మద్ద తుతో ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో జిల్లా లోని గట్టు మండలంలో గత సెప్టెంబర్ 28న నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో అర్హులైన ది వ్యాంగులను గుర్తించి, ఇప్పుడు వారికి అవసరమైన అత్యాధునిక పరికరాలను అందజేస్తున్నట్లు తెలిపారు.

దివ్యాంగుల సంక్షేమం కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయని,అందులో భాగంగా ప్రతి దివ్యాంగుడు ఆధార్ కార్డ్ పొందడం ద్వారా దేశంలో ఎక్కడైనా ఆయా సదుపాయాలు పొందగలరని అన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని వారు తెలిపారు.జిల్లాలో 93 మంది దివ్యాంగులకు రూ. 21.27 లక్షల విలువైన 114 పరికరాలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.

దివ్యాంగులకు అందించిన పరికరాలను సమర్థవంతంగా ఉపయోగించాలని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు అందించేందుకు ప్రభుత్వంతో కలిసి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ,నర్సింగ రావు,జిల్లా సంక్షేమ అధికారి సునంద,ఆల్మికో ప్రతినిధి సునీత దాస్,దివ్యాంగులు,తదితరులు పాల్గొన్నారు.