15 March, 2026 | 11:09 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

పువ్వాడ అజయ్ పిటిషన్ కొట్టివేత

28-09-2024 02:42 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): 2014 ఎన్నికల సమయం లో పువ్వాడ అజయ్‌కుమార్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ నమోదైన కేసును కొట్టివేయాలన్న అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మద్యం, క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తున్నారంటూ ఎన్నికల అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2014 ఏప్రిల్ 28న ఖమ్మం జిల్లా ఖానాపురం హవేలి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసును కొట్టివేయాలంటూ 2014లో పువ్వాడ అజయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ క్రికెట్ కిట్ల పంపిణీతో ఎలాంటి సంబంధంలేదని తెలిపారు. వసతి గృహంలో స్వాధీనం చేసుకున్న కిట్లు తనకు చెందినవని తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపై విచారించిన న్యాయమూర్తి ఫిర్యాదులోని అంశాలు విచారణలో తేలాల్సిందేనంటూ పువ్వాడ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.