15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

హనుమాన్ దీక్ష పరులకు అన్నప్రసాద వితరణ

11-04-2025 01:19 AM

కొత్తపల్లి, ఏప్రిల్ 10: కరీంనగర్ పట్టణంలోని కొత్తపల్లి వార్డులో గల మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి గెస్ట్ హౌస్ లో కొత్త జయపాల్ రెడ్డి సహకారం తో మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో ఈనెల 12వ తారీకు చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం నుంచి జయంతి వరకు  హనుమాన్ దీక్ష మాలదారులకు అన్న ప్రసాదన వితరణ (బిక్ష) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి కొత్త జయపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హజరై హనుమాన్ చిత్రపటానికి  ప్రత్యేక పూజలు చేసి, స్వాములకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా కొత్త జయపాల్ రెడ్డి మాట్లాడుతూ హనుమాన్ దీక్ష మాలదారులకు  అన్న ప్రసాద వితరణ చేయడం తన అదృష్టమని, నేటి నుండి చిన్న హనుమాన్ జయంతి వరకు అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

అదేవిధంగా మాజీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ డి సంపత్ మాట్లాడుతూ హనుమాన్ మాల దీక్షపరులకు అన్నదానం చేసేందుకు సంకల్పించి మొదటగా కొత్త జయపాల్ రెడ్డిని సంప్రదించగా వారు వెంటనే అంగీకరించి వారి సహకారం అందించారని వారితోపాటు మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, అన్నమనేని రాంప్రసాదరావు, ఆది వివేక్, చల్ల హరి శంకర్, అయ్యప్ప మహా పాదయాత్ర  గురు స్వామి గడప నాగరాజు, బిఆర్‌ఎస్ నాయకులు ఎం.ఏ కరీం ల సహకారంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మం, నల్ల ఆదిరెడ్డి, శ్రీను,విజయ్,శివ, ఎడవెల్లి కుమార్, జయపాలన్న మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు.