30 June, 2026 | 10:08 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

హనుమాన్ దీక్ష పరులకు అన్నప్రసాద వితరణ

11-04-2025 01:19 AM

కొత్తపల్లి, ఏప్రిల్ 10: కరీంనగర్ పట్టణంలోని కొత్తపల్లి వార్డులో గల మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి గెస్ట్ హౌస్ లో కొత్త జయపాల్ రెడ్డి సహకారం తో మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో ఈనెల 12వ తారీకు చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం నుంచి జయంతి వరకు  హనుమాన్ దీక్ష మాలదారులకు అన్న ప్రసాదన వితరణ (బిక్ష) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి కొత్త జయపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హజరై హనుమాన్ చిత్రపటానికి  ప్రత్యేక పూజలు చేసి, స్వాములకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా కొత్త జయపాల్ రెడ్డి మాట్లాడుతూ హనుమాన్ దీక్ష మాలదారులకు  అన్న ప్రసాద వితరణ చేయడం తన అదృష్టమని, నేటి నుండి చిన్న హనుమాన్ జయంతి వరకు అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

అదేవిధంగా మాజీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ డి సంపత్ మాట్లాడుతూ హనుమాన్ మాల దీక్షపరులకు అన్నదానం చేసేందుకు సంకల్పించి మొదటగా కొత్త జయపాల్ రెడ్డిని సంప్రదించగా వారు వెంటనే అంగీకరించి వారి సహకారం అందించారని వారితోపాటు మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, అన్నమనేని రాంప్రసాదరావు, ఆది వివేక్, చల్ల హరి శంకర్, అయ్యప్ప మహా పాదయాత్ర  గురు స్వామి గడప నాగరాజు, బిఆర్‌ఎస్ నాయకులు ఎం.ఏ కరీం ల సహకారంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మం, నల్ల ఆదిరెడ్డి, శ్రీను,విజయ్,శివ, ఎడవెల్లి కుమార్, జయపాలన్న మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు.