calender_icon.png 15 June, 2025 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ నిర్వాసితులకు పరిహారం పంపిణీ

14-06-2025 07:41:02 PM

పది మందికి నష్టపరిహారం చెక్కులు అందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా..

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): వేములవాడ పట్టణంలో రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు శనివారం చెక్కులు పంపిణీ చేశారు. వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్న సందర్భంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు జిల్లా సమీకృత కార్యాలయల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Collector Sandeep Kumar Jha), వేములవాడ ఆర్డీవో రాధాబాయి(RDO Radhabai) చెక్కులు పంపిణీ చేశారు. వేములవాడలోని పది మందికి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.