13 April, 2026 | 6:12 PM

పరీక్షల వేళ విద్యార్థులకు పండ్లు, మజ్జిగ పంపిణీ

13-04-2026 05:09 PM

పెంచికల్‌పేట (విజయక్రాంతి): మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పోతపల్లి సర్పంచ్ దుర్గం పోషన్న ఆధ్వర్యంలో అరటిపండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు.వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో బండి వెంకటాచలం, ఉప సర్పంచ్ గిరుగుల చిన్నయ్య, బండి మహేష్, చౌదరి గోపాల్, చౌదరి శ్రీకాంత్, ముత్తినేని తిరుపతి, కుబిడే రాజన్న, తెలిగ శంకర్, ఎల్కరి తిరుపతి, లంగారి ప్రకాష్, గంధం శేఖర్, తోగామ సాయికుమార్, అల్లూరి కిషన్, పంకజ్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.