12-06-2025 12:29:49 AM
తూప్రాన్, జూన్ 11 : తూప్రాన్ పురపాలక సంఘ కార్యాలయం యందు ఏర్పాటుచేసిన సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మంజూరైన నిరుపేదలకు పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారికంగా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను వారి చేతుల మీదుగా అందించారు, ఇందులో తూప్రాన్ పట్టణ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.