calender_icon.png 16 June, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరికీ అందుబాటులో ఉంటా

12-06-2025 12:28:59 AM

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  

జగిత్యాల అర్బన్, జూన్ 11(విజయక్రాం తి): నిజాయితీగా పార్టీ కోసం పనిచేసిన వారికి ఎప్పటికైనా తగిన గుర్తింపు ఉంటుందని, మంత్రిగా తాను అందరికీ అందుబాటు లో ఉంటూ సేవలందిస్తానని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి జగిత్యాలకు వచ్చిన అడ్లూ రికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు.

మాజీ మంత్రి  తాటిపర్తి జీవన్ రెడ్డి ఆద్వర్యంలో జిల్లా నలుమూలల నుండి పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి,  బైపాస్ రోడ్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాల వేసిన అనంతరం ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక టౌన్ హాల్లో అభినందన సభ ఏర్పాటు చేశారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. అందరి కృషి, ఆశీర్వాదంతో తనకు మంత్రి పదవి దక్కిందన్నా రు.

పనిలో నిజాయితీగా ఉండాలని, పార్టీ కో సం పనిచేయాలని సూచించారు. సుప్రీం కో ర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణ చేపట్టిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింద న్నా రు. కష్టాల్లో తోడుగా నిలిచిన జీవన్ రెడ్డి సహకారంతో ముందుకు సాగుతానని, జీవ న్ రెడ్డికి అండగా నిలుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జువ్వాడి న ర్సింగరావు, ఆకుల లింగారెడ్డి, కొమిరెడ్డి క రం, బండ శంకర్, షాకీర్, గాజంగి నంద య్య, జున్ను రాజేందర్, తాటిపర్తి విజయలక్ష్మి, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యం లో...  క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకా రం చేసిన అనంతరం మొదటిసారిగా జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వ చ్చిన మంత్రి అడ్లూరిని ఎమ్మెల్యే డాక్టర్ సం జయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వివిధ కుల సంఘాలు, ఉద్యోగ  ఉపాధ్యాయ సంఘ నాయకులు మంత్రి అడ్లూరిని ఘనంగా సన్మానించారు.

ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్ర స్థానం లో నిలిపే ప్రయత్నం చేస్తారన్నారు. జనాభాకి తగినట్టు చట్ట సభల్లో హక్కు ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కుల గణన చేపట్టిందన్నారు. తాను చిన్న కార్యకర్త స్థాయి నుండి మంత్రిగా ఎదగడం కాంగ్రెస్లోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, జ్యోతి లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్లు, నాయకులుపాల్గొన్నారు.