7 May, 2026 | 2:49 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

దివ్యాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ

04-12-2024 12:58 AM

పటాన్‌చెరు, డిసెంబర్ 3: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభు త్వం సంపూర్ణ సహకారం అందిస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మంగళారం పటాన్‌చెరు లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం, ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

సర్కిల్ పరిధిలోని 3 డివిజన్లకు సంబంధించిన 225 మంది దివ్యాంగులకు రూ.17.97 లక్షలతో కొనుగోలు చేసిన  వినికిడి యంత్రాలు, వీల్ చైర్లు, చేతికర్రలు, ట్రై సైకిళ్లను కార్పొరేటర్లను మెట్టు కుమార్‌యాదవ్, పుష్పనగేశ్, సింధుఆదర్శ్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేశ్, సీఐ వినాయక్‌రెడ్డి, నాయకులు అఫ్జల్ పాల్గొన్నారు.