15 April, 2026 | 1:11 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బాస్కెట్ బాల్ రాష్ట్ర అసోసియేషన్‌లో జిల్లా వాసులు

01-04-2025 11:56 PM

మంచిర్యాల (విజయక్రాంతి): హైదరాబాద్ గచ్చిబౌలిలోని హోటల్ క్లేరియన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఎన్నికల్లో జిల్లాకు చెందిన ఇద్దరు ఎన్నికయ్యారు. రిటర్నింగ్ అధికారిగా హై కోర్ట్ జస్టిస్ పి నవీన్ రావు వ్యవహరించగా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల నుంచి 20 మంది పోటీపడ్డారు. జిల్లాకు చెందిన చంద్రమోహన్ గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా గెలుపొందగా, రాష్ట్ర అసోసియేట్ సెక్రటరీగా సుకుమార్ ఫ్రాన్సిస్ విజయం సాధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజులలో గ్రామీణ ప్రాంతాలలో సైతం బాస్కెట్ బాల్ గేమ్ అభివృద్ధికి దోహదపడుతామన్నారు. తమ గెలుపుకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, సెక్రటరీ పృద్వీశ్వర్ రెడ్డిలతో పాటు వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపారు.