14-02-2026 12:40:23 AM
ములకలపల్లి,ఫిబ్రవరి 13 (విజయక్రాంతి):మండలంలోని సీతారాంపురం పం చాయతీ ముర్రేడు వాగు నుండి ఇసుక అక్రమ రవాణా నిరోధానికి అధికారులు చ ర్యలు తీసుకున్నారు. రెవెన్యూ, పోలీస్, పం చాయతీరాజ్ శాఖ అధికారులు సంయుక్తంగా అక్రమ మార్గాల ప్రాంతాలైన సీతా రాంపురం,గుర్రాలకుంట సమీపంలో నుంచి వెళ్తున్న ముర్రేడు వాగులో ఇసుక తోలే ప్రదేశాలను గుర్తించి,
ఆ ప్రాంతంలో జేసీబీ సహాయంతో కందకాలు తవ్వించారు. నిబంధనలను ఉల్లంఘించి ఇసుక అక్రమ రవా ణాకు పాల్పడే వ్యక్తులపై పిడి యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భాగ్య లక్ష్మీ ,ఎస్త్స్ర మధు ప్రసాద్, మండల గిర్ధావర్ బి. భద్రు, సర్పంచ్ కుంజా రవి పాల్గొన్నారు.