13-02-2026 12:00:00 AM
ఎల్బీనగర్, ఫిబ్రవరి 12 : ప్రభుత్వ దవాఖానల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ లలితా దేవి సూచించారు. గురువారం హయత్ నగర్ వార్డు కార్యాలయం పరిధిలోని అర్బన్ ప్రైమరీ సెంటర్ , హయత్ నగర్ బస్తీ దవాఖాన , రంగనాయకుల గుట్టలోని యూపీహెచ్సీ, బస్తీ దవాఖాన, మునగనూరులోని బస్తీ దవాఖాన, యూపీహెచ్సీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేయాలని ఆదేశించారు.