కంకోల్ పీహెచ్సీని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ
03-01-2026 12:00 AM
మునిపల్లి, జనవరి 2 : మండల పరిధిలోని కంకోల్ ప్రాథమిక ఆరో గ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత్ రావు ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ఈ సందర్భం గా రికార్డులు, కంకోల్ లో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రి పనులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మె రుగైన వైద్యం అందించేందుకు వై ద్యాధికారులు సమయపాలన పా టించాలని సూచించారు. నూతనంగా నిర్మిస్తున్న పిహెచ్సి భవన నిర్మా ణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఆయన వెంట డాక్టర్ రవి, ఏఎన్ఎం నిర్మల తదితరులు ఉన్నారు.




