30 June, 2026 | 9:53 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

మధ్యవర్తుల నమ్మి మోసపోవద్దు

03-12-2024 04:41 PM

ఎమ్మెల్యే హరీష్ బాబు

ఎమ్మెల్సీ దండే విఠలతో కలిసి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): మధ్యవర్తులను నమ్మి లబ్ధిదారులు మోసపోవద్దని ఎమ్మెల్యే హరీష్ బాబు ఎమ్మెల్సీ దండే విట్టల్ అన్నారు. మంగళవారం సిర్పూర్ (టి) మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో 91 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దళారులను నమ్మి తప్పిదారులు మోసపోవద్దని సూచించారు. ఎవరికీ కూడా డబ్బులు ఇవ్వవద్దని తెలిపారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా కల్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ సత్యనారాయణ, ఎఓ గిరీషన్ తదితరులు పాల్గొన్నారు.