15 June, 2026 | 11:25 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

సచివాలయ సెక్యురిటీని మార్చవద్దు!

27-07-2024 12:05 AM

రాష్ట్రంలోనే అత్యంత క్రమశిక్షణ కలిగిన పొలీసులుగా పేరొందిన టీజీఎస్‌పీ (తెలంగాణ ప్రత్యేక పోలీస్) సిబ్బంది విధులను ‘రాష్ట్ర నూతన సచివాలయం’ నుండి తప్పిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే, ఈ విషయమై ప్రభుత్వం పునరాలోచిం చాలి. వీరు ప్రారంభం నుండి సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. మొదట కొంత ఇబ్బంది పడినా క్రమంగా పటిష్ఠమైన భద్రతను ఇస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. సచివాలయంలో టీజీఎస్‌పీలు ప్రతి రోజూ మూడు షిఫ్ట్‌లుగా 400 మంది, ఇతర ఎఆర్, సివిల్ ట్రాఫిక్ సిబ్బందితో కలిసి మొత్తం సుమారు 600 మంది పని చేస్తున్నారు.

ముఖ్యమంత్రి, సీఎంఓ  ఆఫీసర్స్, సీఎస్ ఉండే 6వ ఫ్లోర్‌తోపాటు ఇతర మంత్రుల చాంబర్లవద్ద పూర్తి పర్యవేక్షణ బాధ్యతను వారే తీసుకున్నారు. సెక్రటేరియట్‌లో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల విధులలో ఎటువంటి ఆటంకం కలుగకుండా, నిరంతరం పనులపై వచ్చే సందర్శకులకు అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నారు. దీంతోపాటు సెక్రటేరియట్ ప్రాంగణంలో నిర్మితమైన మత సంబంధ కట్టడాల రక్షణ, నిరంతరం ప్రార్థనల కోసం వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటారు.

వీరిపై ఆర్థిక, రాజకీయ పరమైన ఆరోపణలు లేవు. టీజీఎస్పీ (పోలీస్) సిబ్బందిని సచివాలయ విధుల నుండి తప్పిస్తున్నారని వార్తలు రావడంతో వారిలో అయోమయం నెలకొంది. అన్ని విభాగాలో పనిచేసిన, ఆరితేరిన, అనుభవజ్ఞులైన ఈ పోలీసు విభాగం సిబ్బంది సేవలు వాడుకోవాల్సిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

 -శేఖర్ పగిళ్ళ