calender_icon.png 6 June, 2025 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపరేషన్ సిందూర్‌నే శంకిస్తారా?

31-05-2025 12:00:00 AM

- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, సీఎం రేవంత్‌లపై బీజేపీ నేతల ధ్వజం

న్యూఢిల్లీ, మే 30: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రే వంత్‌రెడ్డిపై బీజేపీ నేతలు అమిత్ మా లవీయా, సంబీత్ పాత్రా ధ్వజమెత్తా రు. ఆపరేషన్ సిందూర్‌ను శంకించే బ దులు.. వెళ్లి పాకిస్థాన్‌తో కలిసి మీడి యా సమావేశం నిర్వహించుకోవాల ంటూ చురకలంటించారు.

శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం లో వీరు మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ సిందూర్ వి షయంలో కాంగ్రెస్ నేతలు జైరాం ర మేశ్, రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి తదితరులు అడ్డగోలు వ్యాఖ్యలు చే స్తున్నారు. పాకిస్థాన్‌లో ఎన్ని ఎయిర్‌బేస్‌లు ధ్వంసమయ్యాయి? ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారు? లాంటి ప్రశ్నలకు బదులు కేవలం భారత్‌కు చె ందిన ఎన్ని రఫెల్స్ యుద్ధవిమా నా లను పాక్ నేలకూల్చిందని ప్రశ్నిస్తున్నా రు’ అని పేర్కొన్నారు.

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ ‘మీరు చేపట్టిన జైహింద్ యా త్ర.. పాకిస్థాన్ హింద్ యాత్రలా తయారైంది. మీరు మీ యా త్రను ఆపితే మంచిది. అలాగే వెళ్లి పా క్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించుకోండి’ అంటూ చురకలు అ ంటించారు.