05-06-2025 06:06:09 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య బృందం మొక్కలు నాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం(World Environment Day) పురస్కరించుకొని వైద్యులు ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వైద్యురాలు స్వర్ణ రెడ్డి మాట్లాడుతూ... నాటిన ప్రతి మొక్క 1000 మందికి జీవనాధారం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ స్రవంతి, డాక్టర్ సుధీర్, డాక్టర్ ఉపేంద్ర, డాక్టర్ సందీప్, ఆరోగ్య శ్రీ, డయాలసిస్ సిబ్బంది ఉన్నారు.