ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదానం
21-03-2026 12:04 AM
అలంపూర్ మార్చి 20: శాంతినగర్ సేవా సమితి సభ్యుడు వడ్డేపల్లి సభ్యులు దొండే రమేష్ శుక్రవారం తన పుట్టినరోజు పురస్కరించుకొని రోగులకు అన్నదానం కార్యక్ర మాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం వచ్చిన సుమారు 150 మంది రోగులకు అన్నదానాన్ని అందించారు. ఈ సందర్భంగా సేవా దృక్పథం కలిగిన రమేష్ ను గద్వాల తిరుపతి దేవస్థానం వారు అభినందించి శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో స్థానికులు షేక్ అస్లాం షరీఫ్ ప్రసాద్ ,రాజు, అరవిందు నిర్వాహకులు పాల్గొన్నారు.




