21 March, 2026 | 12:08 PM

మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి

21-03-2026 12:05 AM

అలంపూర్ మార్చి 20: ముస్లిం మైనారిటీ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అందులో భాగంగానే ముస్లిం మైనారి టీ సోదరులకు రంజాన్ తోఫా అందించే కార్యక్రమం చేపట్టిందని డీసిసి జనరల్ సెక్రెటరీ మహమ్మద్ సిరాజ్, నాయకులు పుల్లూ రు శ్రీకాంత్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం పుల్లూరు గ్రామంలో మైనార్టీ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రంజాన్ తోఫాను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరీమణులు, అమినాబీ ,ఫాతిమాభి, రభీజాబీ హసీనాబీ, కంగల్ అయూబ్ ఇర్ఫాన్ సయ్యద్ రసూల్, నాయకులు మహేష్ రామాంజనేయులు వెంకటేశ్వర్లు నిషార్ అహ్మద్ , శాలంమియా తదితరులు పాల్గొన్నారు.