త్వరలో సొంత భవనాల్లోకే తహసీల్దార్ కార్యాలయం
21-03-2026 12:02 AM
రేవల్లిలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
రేవల్లి మార్చ్ 20: ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రేవల్లి మండలంలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం ఆయన ఆయా మండలాల్లో పర్యటిం చి, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న భవనాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భవనాల నిర్మాణ నాణ్యతను సమీక్షించి, పెండింగ్లో ఉన్న ఫర్నిచర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యాలయాలను వెంటనే నూతన భవనాల్లోకి మార్చి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అ న్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకురావాలని తహసీల్దార్లకు సూచించారు. కలె క్టర్ వెంట తహసీల్దార్ సరస్వతి తదితరులు ఉన్నారు.




