10 May, 2026 | 8:08 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

అతివిశ్వాసం వద్దు!

15-10-2024 02:09 AM

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ‘అతివిశ్వాసం వద్దు. ఐక్యంగా ఉండండి. వాస్తవ ప్రతికూల పరిస్థితులను గుర్తించండి. వాటికి ఎదురొడ్డి పోరాడండి’ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే పిలుపునిచ్చారు. హర్యా నా ఎన్నికల ఫలితాల్లో పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయాని ప్రస్తావించకుండానే ఆయన మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేతలకు చురకలు అంటించారు.

మరికొ ద్దిరోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మంగ ళవారం న్యూఢిల్లీలోని ఖర్గే నివాసం లో ఆ రాష్ట్ర నేతలతో భేటీ అయ్యా రు. ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై కీలక సూచనలు చేశా రు.  పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోపై సుదీర్ఘంగా చర్చించారు.

‘మహావికాస్ అఘాడీ’ ఎత్తుగడలను తిప్పికొ ట్టే వ్యూహాలపై  ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడారు. పార్టీ నేతలు కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలను కలపుకొని పోవాలన్నారు. అంతర్గత విభేధాలను పక్కన పెట్టాలన్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.