calender_icon.png 7 June, 2025 | 4:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులతో దురుసుగా ప్రవర్తించవద్దు

05-06-2025 12:00:00 AM

కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, జూన్ 4 (విజయక్రాంతి): గ్రామ రెవెన్యూ సదస్సులకు హాజరయ్యే రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని కలెక్టర్ అభిలా ష అభినవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారిన గ్రామ రెవెన్యూ సదస్సులకు సంబంధించిన వీడియో జిల్లా యంత్రాంగం సీరి యస్‌గా తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ సదస్సులో రైతుపై దురుసుగా ప్రవర్తించిన ఏఎస్సైను పోలీస్ శాఖ తరపున  సస్పెండ్ జరిగింది.

తదుపరి విచారణ కొనసాగుతుందని  తెలిపారు. రెవెన్యూ సదస్సు లకు హాజరయ్యే ప్రజలకు అధికారులంతా సహకారం అందించాలని సూచించారు. భూ సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి నూతన చట్టాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. భూభారతి గ్రా మ రెవెన్యూ సదస్సులు రెండో దశలో భాగంగా ఈ నెల 3 నుంచి 20వ తేదీ వరకు అన్ని మండలాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే 36 రెవెన్యూ గ్రామాలలో 1000 కి పైగా సమస్యలకు సంబం ధించి దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు.ప్రజలంతా రెవెన్యూ సదస్సులలో భూ సమస్యల దరఖాస్తులను సమర్పించి, పరిష్కరించుకోవాలని కలెక్టర్ కోరారు.