calender_icon.png 7 June, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో మండల సర్వేయర్

05-06-2025 12:00:00 AM

మంచిర్యాల, జూన్ 4 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ల్యాండ్ కొలిచేందుకు రూ.లక్ష డిమాండ్ చేసిన అవినీతి అధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... మంచిర్యాల జిల్లా కేంద్రంలోనీ ఒక భూమికి సంబంధించి సర్వే చేయడం కోసం మంచిర్యాల మండల సర్వేయర్ మంజుల బాధితుడి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు.

సర్వేయర్ మంజులకు తన అసిస్టెంట్ ఉదయ్ ద్వారా బాధితుడు విడతలవారీగా ఫోన్ పే, నెట్ క్యాష్ ద్వారా రూ. 26,500 ముట్ట చెప్పాడు. డబ్బులు తీసుకొని ల్యాండ్ సర్వే చేయకుండా మరో 30000 రూపాయలు ఇస్తే గాని పనిచేయమని ఇబ్బందులకు గురి చేస్తుండడంతో బాధితుడు మంచిర్యాల ఏసీ బీ అధికారులను  ఆశ్రయించాడు.

ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం మంచిర్యాల తహసిల్దార్ కార్యాలయంలో మండల సర్వేయర్ మం జుల, ఆమె అసిస్టెంట్ (చైన్ మెన్) ఉదయ్ నీ అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. బాధితుడు అందించిన సమాచారం తో నగదు తీసుకున్నట్లు నిర్ధారణ జరిగింద ని ఏసీబీ అధికారి విజయ్‌కుమార్ తెలిపా రు. అధికారులు నిర్లక్ష్యంగా విధులు నిర్వహించడంతో ఆర్ సి ఓ కింద కేసు నమోదు చేశామని, పూర్తి విచారణ చేపట్టి కోర్టులో నిందితులను ప్రవేశపెడతామని తెలిపారు.