07-06-2025 01:31:24 AM
ఓ సామాన్య భక్తుడి పేరిట కాంగ్రెస్ నేత లేఖ
మతసామరస్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి
సిరిసిల్ల జూన్, 6 (విజయక్రాంతి ); వేములవాడ దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని దర్గా విషయం వివాదాస్పదంగా మారుతోంది. ఇటీవల లేడీ అఘోరి రాజన్న ఆలయంలోని దర్గాను కూలుస్తానని హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. స్థానిక శాసనసభ్యులు , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో వేములవాడ అభివృద్ధిలో భాగంగా రాజన్న ఆలయ పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
కాగా రాజన్న ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా గర్భగుడి ఆవరణలో దర్గాను నిర్మించోద్దంటూ ఓ సామాన్య భక్తుడి పేరిట ఆల య ఈవోకు ఓ వ్యక్తి లేఖ రాశాడు. ప్రస్తుతం ఆ లేఖ లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోం ది.సామాన్య భక్తుడి పేరిట కాంగ్రెస్ నేత లేఖ అయితే సామాన్య భక్తుడి పేరిట పిసిసి ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యుడు, న్యాయవాది బుర్ర రవితేజ గౌడ్ ఈ లేఖను రాయడం విశేషం.
హిందువుగా, ఓ సామాన్య భక్తుడిగా హిందూ సాంప్రదాయాన్ని పాటించే వారి కోరిక మేరకే లేఖ రాసినట్లు లేఖలో రవితేజ తెలిపాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూ దేవాలయాల్లో సమాధులు ఉండడం చరిత్రలో ఎక్కడా లేదని, అలాగే పవిత్ర గ్రంథాలలో కూడా చద వలేదని రాసుకొచ్చాడు. అలాగే ఖురాన్ పవిత్ర గ్రంథం ప్రకారం అల్లా ఒక్కడే దేవుడని, అతన్ని మాత్రమే ముస్లింలు పూజించాలని గ్రంథం చెబుతుందన్నారు.