07-06-2025 01:28:15 AM
కరీంనగర్, జూన్ 6 (విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు ఈనెల 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.19 వరకు రోజు వారి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు దిశా నిర్దేశం చేశారు.
7న ప్రతీ ఇంటిని సందర్శించి బడీడు పిల్లలను గుర్తించాలని, 8 నుంచి 10 తేదీ వరకు కరప త్రాలతో ఇంటింటి ప్రచారం, అంగన్వాడీ కేంద్రాల సందర్శన, డ్రాప్ఔట్ పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడంతో పాటు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించి అం దుబాటులో ఉన్న భవిత కేంద్రాల్లో చేర్పించాలని ఆదేశించారు.
11న నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించాలని, 12న అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పను లను ప్రజా ప్రతినిధులతో ప్రారంభించాలని, అదే రోజు విద్యార్థు లకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం లను అందించాలన్నారు. 13న సామూ హిక అక్షరాభ్యాసం, బాలలసభ, 16న ఎఫ్ ఎల్ ఎన్, ఎల్ఐపి దినోత్సవం నిర్వహించాలని అన్నారు. 17న విలీన విద్య, బాలిక విద్యా దినోత్సవం, 18న తరగతి గదుల డిజిటలీ కరణపై అవగాహన, మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించాలని, 19న బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించాలనిసూచించారు.