calender_icon.png 15 June, 2025 | 10:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోడు భూములలో ఫల సహాయం మొక్కల పెంపకం పేరుతో రైతులను మోసం చెయ్యద్దు

14-06-2025 10:59:01 PM

 మామిడి, నిమ్మ, జామ, కొబ్బరి, దానిమ్మ, సపోటా, పామాయిల్ చెట్ల పెంపకం చేపట్టి అందులో వచ్చే ప్రతిఫలం రైతులకు అందాలి

భయాందోళన చెందుతున్న రైతులను కలిసిన కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు..   

మంత్రి సీతక్క దృష్టికి తీసుకుని పోయి మీకు న్యాయం జరిగే విధంగా చూస్తాం..

ఏటూరునాగారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు..

ఏటూరునాగారం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పోడు భూముల సమస్యలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తప్పకుండా పరిష్కారం చూపిస్తామని చెప్పడం జరిగిందని, ఫారెస్ట్ ఉన్నత అధికారుల సహకారంతో రైతులకు సంబంధించిన భూములలో పండ్ల మొక్కల పెంపకానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు న్యాయం చేస్తుందని ఇట్టి విషయాన్ని మంత్రి సీతక్క చొరవతో పరిష్కార మార్గాన్ని ఫారెస్ట్ అధికారులు, మంత్రి సీతక్క చూపిస్తారని, చిన్నబోయినపల్లి రైతులు ఎటువంటి భయాందోళన చెందవద్దని ఏటూరునాగరం కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి హామి ఇవ్వడం జరిగింది.

స్థానిక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇట్టి భూములలో అడవి జాతికి చెందిన ఉసిరి, నేరేడు, కుంకుడు, వేప, వెదురు, మొదలైన మొక్కలను పెంచడానికి ప్రయత్నిస్తున్నారు అని రైతులు చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఇట్టి భూములలో రైతులకు సంబంధించిన పలసహాయం మొక్కలు మామిడి,నిమ్మ,సపోటా,దానిమ్మ,జామ,పామాయిల్,మమొదలైన పండ్ల మొక్కల పెంపకానికి అనుమతి మంత్రి సీతక్కతో ఇప్పిస్తామని ఏటూరునాగరం కాంగ్రెస్ పార్టీ నాయకులు హామి ఇచ్చి చిన్నబోయినపల్లి గ్రామ రైతులు ఎటువంటి భయాందోళన చెందవద్దని చెప్పడం జరిగింది. దీనితో గ్రామస్థులు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి సీతక్కపై నమ్మకంతో ఆనందం వ్యక్తం చేయడం జరిగిందనీ అన్నారు. ఎటువంటి పొరపాటు జరిగిన ముందుగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకత్వం రైతుల పక్షాన పోరాటం చేస్తుందని అన్నారు.