01-06-2025 12:19:20 AM
హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): రాష్ట్రంలో మరో 5 రోజులపాటు వానలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నేటి నుంచి ఈ నెల 5 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం 3 డిగ్రీల మేర తగ్గనున్నాయని తీపి కబు రు చెప్పింది.
ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ 30 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
సోమవారం నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూ పాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి.