17 April, 2026 | 11:50 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

పైపులైన్ లీకేజీలతో త్రాగునీరు కలుషితం

10-04-2025 11:16 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): సింగరేణి త్రాగునీటి పైపులైన్‌ లీకేజీతో తాగునీరు కలుషితమవుతున్నాయని అబ్రహం నగర్, సర్దార్ వల్లభాయ్ నగర్ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం సుమారు 40 సంవత్సరాల క్రితం నిర్మించిన పైపులైన్లకు కాలం చెల్లిపోవటంతో పైపులకు రంద్రాలు పడ్డయని, అలాగే డ్రైనేజీ కాలువలో ఉన్న మంచినీటి పైప్‌లైన్‌ లీకేజీ కావడంతో నీరంతా కలుషితమవుతున్నాయని వాటివల్ల తాము అనారోగ్యం బారిన పడుతున్నామని అన్నారు. ఇప్పటికైనా సింగరేణి ఉన్నతాధికారులు స్పందించి తమ కాలనీల్లో పైపులైన్లు మరమ్మత్తు చేసి డ్రైనేజీ నీరు మంచినీటి పైప్‌లైన్‌లో కలువకుండా చర్యలు తీసుకోవాలని కార్మికవాడ ప్రజలు అధికారులను కోరుతున్నారు.