17 April, 2026 | 9:42 PM

Breaking News

రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •  

గర్భిణి మృతి కేసులో డ్రైవర్‌కు ఏడాదిన్నర జైలుశిక్ష

28-03-2025 12:29 AM

ఎల్బీనగర్, మార్చి 27 : హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాగిన మైకంలో నిర్లక్ష్యంగా ఆటో నడిపి గర్భిణి మృతికి కారణమైన కేసులో కోర్టు నిందితుడికి ఏడాదిన్నర జైలుశిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. హయత్నగర్ లోని కుంట్లూరులో నివాసం ఉంటున్న ఓరుగంటి సుభాష్ (43)  తాగిన మైకంలో నిర్లక్ష్యంగా ఆటో నడిపి రోడ్డు దాటుతున్న జంటను ఢీకొట్టాడు.

ఈ  ప్రమాదంలో గర్భిణితోపాటు ఆమె కడుపులో ఉన్న శిశువు మృతి చెందారు. ఈ ప్రమాదంపై 2017 లో హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడ్ని రిమాండ్ తరలించారు.  కేసును విచారించిన ఎల్బీనగర్ లోని  పీడీజేఐ కోర్టు దోషిగా నిర్ధారించింది.  న్యాయమూర్తి గురువారం తీర్పు వెలువరించారు.  నిందితుడ్ని దోషిగా నిర్ధారించి ఏడాదిన్నర జైలుశిక్ష తోపాటు రూ. 500 విధించారు. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేవీ బీనా  వాదనలు వినిపించారు.