14-06-2025 01:34:31 PM
మంథని,(విజయక్రాంతి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శ్రీను బాబు పిసిసి అధ్యక్షుడితో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని, తన పై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి శ్రీను బాబు కృతజ్ఞతలు తెలిపారు. తెలిపారు. ఆయన వెంట సచిత్ర తదితరులు ఉన్నారు.