14-06-2025 01:42:24 PM
కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): ఇటీవల పరమపదించిన ప్రజా బంధు డాక్టర్ భూంరెడ్డి చిత్రపటానికి స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాల ముందు గల రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి స్తూపం వద్ద రెడ్డి సంఘాల ఐక్య వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు వంచసుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ... డాక్టర్ భూమి రెడ్డి గారు కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పేద ప్రజలకు మెరుగైన ఉపాధ్యాయ సేవలు అందించి అందరి మన్ననాలు పొందారని కరీంనగర్ జిల్లా రాజ బహదూర్ వెంకట్రాంరెడ్డి ఫంక్షన్ హాల్ అభివృద్ధి కొరకు ఎనలేని సేవలు చేశారని కొనియాడారు.