14-06-2025 12:37:54 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ అధనేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శనివారం మరోసారి గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. వైద్య పరిక్షల నిమిత్తం ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన ఆయన గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తడంతో శుక్రవారం కూడా ఆసుపత్రికి వచ్చారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కేసీఆర్ తో పాటు, పార్టీ ఎంపీ సంతోష్, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆసుపత్రికి వెళ్లి గంట పాటు అక్కడే ఉన్నారు. ఏఐజీ ఛైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు డా.నాగేశ్వర్ రెడ్డి కేసీఆర్ కు కొన్ని పరీక్షలు నిర్వహించి, శనివారం మళ్ళీ ఆసుపత్రికి రావాలని సూచించడంతో ఆయన ఇవాళ మళ్లీ వెళ్లారు. కేసీఆర్ ఇటీవలే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా ఆయన కమిషన్ను వన్-ఆన్-వన్ విచారణకు అభ్యర్థించారు. విచారణ తర్వాత బీఆర్ఎస చీఫ్ వెంటనే తన ఫామ్హౌస్కు వెళ్లిపోయారు.