01-08-2025 12:53:52 AM
తెలంగాణ పోలీస్ అకాడమీ డైరక్టర్ అభిలాష బిస్ట్
వరంగల్ జూలై 31 (విజయక్రాంతి): పోలీస్ అధికారులు తమ వృత్తిలో నైపుణ్యం సాధించేందుకుగా పోలీస్ డ్యూటీ మీట్లు ఎంతగానో దొహడపడుతాయని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరక్టర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధ్వర్యంలో పి.టి.సి మామూనూర్ వేదికగా ఎర్పాటు రెండవ తెలంగా పోలీస్ డ్యూటీ మీట్ను గురువారం ఘనంగా ప్రారంభించారు.
తెలంగాణ పోలీస్ అకాడమీ డైరక్టర్ అభిలాష్ బిస్ట, అడిషినల్ డీజీపీ మహేష్ భగవత్, ఈ డ్యూటీ మీట్ను ప్రారంభించారు. నేటి నుండి మూడు రోజుల పాటు జరగన్న ఈ తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్లో రాష్ట్రంలో ఏడు జోన్లతో పాటు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్లు, సిఐడి ఇంతెలిజెన్స్,యాంటీ నార్కోటిక్ బ్యూరో,సైబర్ సెక్యూరీటీ వింగ్, జి.ఆర్.పి, ఐటీఅండ్టి, అక్టోపస్, గ్రేహౌండ్స్ విభాగాలకు చెందిన సూమారు నాలుగు వందలకుపైగా పోలీస్ అధికారులు,
సిబ్బంది సైటిఫిక్ ఎయిడ్, యాంటీ సబటేజ్ చెక్,కంప్యూటర్,డాగ్ స్వ్కాడ్, ప్రోపెషనల్ ఫోటోగ్రఫీ, వీడియో గ్రఫీలకు సంబంధించిన 25 విభాగాల్లో పోటీ పడనున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకల సందర్బంగా ఈ పోటీల్లో పాల్గోన్న పోలీస్ అధికారులు నిర్వహించిన అనంతరం క్రీడాలో ముఖ్య అతిధి చేతుల మీదుగా డ్యూటీ మీట్ జెండాను ఎగురు వేసారు.
ఈ సందర్బంగా ముఖ్య అతిధి మాట్లాడుతూ నూతన ఉత్తేజంతో ఈ పోటీల్లో పాల్గోన్న అధికారులకు ముందుగా అభినందనలు తెలియజేస్తూ దేశంలో నేర దర్యాప్తుతో పాటు అన్ని విభాగాల్లో తెలంగాణ మొదటి రెండు స్థానాల్లో నిలువడం సంతోషించదగ్గ విషయమని మీరందరు కష్టపడి పని చేయడం ద్వారా మనకు ఈ కీర్తి ప్రతిష్ఠలు వచ్చాయని, అలాగే జాతీయ స్థాయిలో డ్యూటీ మీట్లో చక్కటి ప్రతిభ కనబరి అన్ని విభాగాల్లో పతకాలను సాధిస్తారని ఆశిస్తూన్నాని.
మీరందరిపై నమ్మకం వుంది. మీరందరు కఠినంగా సాధన చేస్తే తప్పక విజయం సాధిస్తారని. అడిషినల్ డీజీపీ మహేష్ భగవత్ మాట్లాతూ వరంగల్లో పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం ఇది రెండవ సారని, గతంలో 2008 ఇక్కడ డ్యూటీ నిర్వహించడం జరిగిందని, ఇటీవల జరిగిన 68వ జాతీయ స్థాయి డ్యూటీ మీట్లో తెలంగాణ పోలీసులు 18 పతకాలు సాధించిన తోలి రా్రష్ట్ర పోలీస్గా తెలంగాణ ఘనత సాధించిందని.
ఇదే రీతిలో త్వరలో జరిగే జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలను సాధించేందుకు ప్రతి కృషి చేయాలని తెలిపారు. అంతకు ముందు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణపై వివరించారు. ఈ కార్యక్రమ ములో సిఐడి డీఐజీ నారా యణ నాయక్, ఏస్పీ రాంరెడ్డి, డిసిపిలు అంకిత్కుమార్, షేఖ్ సలీమా, రాజమ హేంద్రనాయక్, పిటిసి ప్రిస్స్పాల్ పూజ, కమాండెట్లు రాంకుమార్, రామకృష్ణతో పాటు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.