3 April, 2026 | 1:24 AM

Districts - Warangal

article_66423431.webp
ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం

వరంగల్, (విజయక్రాంతి): హైదరాబాదులోని మూసాపేటలో మరణించిన తల్లి స్రవంతి, పిల్లలు కార్తీక్, కౌశిక్ ల అంత్యక్రియలు బుధవారం రాత్రి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తండాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య నిర్వహించారు. ఇందులో తల్లి స్రవంతి మృతదేహానికి సమీప వ్యవసాయ పొలంలో అంత్యక్రియలు నిర్వహించగా, ఇద్దరు పిల్లల మృతదేహాలను మాత్రం తండ్రి ప్రవీణ్ ఇంట్లో ఖననం చేశారు. హైదరాబాదులో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను అంబులెన్స్ లో స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఈ సంఘటన నేపథ్యంలో తండాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంతకుముందే ప్రవీణ్ ఇంటిపై స్రవంతి కుటుంబ సభ్యులు బంధువులు దాడికి దిగారు.

02-04-2026