గడ్డి మందుపై పూర్తి నిషేధం విధించాలి
వరంగల్, మార్చి 27 (విజయక్రాంతి): గడ్డి మందు పర్యావరణం, ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని, ఆత్మహత్యలకు ఆయుధంగా మారిన పారాక్వాట్ నిషేధమే దినికి పరిష్కారమని లోక్ సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య డిమాండ్ చేశారు. పారాక్వాట్తో రైతులు, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని, ఐ ఎం ఏ సహా వైద్య వర్గాల నుంచి గడ్డి మందు నిషేధానికి బలమైన మద్దతు పెరిగిందన్నారు. ప్రాణాంతక గడ్డి మందుపై కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
28-03-2026