01-08-2025 12:54:11 AM
లక్షెట్టిపేట, జూలై 31: తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం కార్యనిర్వాహక కమిటీ సభ్యునిగా ఎన్నికైన జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్ కాసమలను గురువారం లక్షెట్టిపేట న్యాయవాదుల సంఘం ఆధ్వర్యం లో శాలువా పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొమిరెడ్డి సత్తన్న, జనరల్ సెక్రెటరీ ప్రదీప్ కుమార్, మాజీ అధ్యక్షుడు గడికొప్పుల కిరణ్ కుమార్, ఎజీ పి సత్యం, సీనియర్ న్యాయవాదులు రాజేశ్వర్ రావు , గోవింద్ రావు, కారుకూరి సురేందర్, అక్కల శ్రీధర్, గాండ్ల సత్యనారాయణ, గడికొప్పుల కిరణ్ కుమార్,నగురు రవీందర్, నలినికాంత్, పద్మ, సంతోష్ బనావత్, మేదరి పల్సన్, సుమన్ చక్రవర్తి తాజో ద్దీన్, రెడ్డిమల్ల ప్రకాశం, సదాశివ, రుమాన్ షెఫీక్ తదితరులు పాల్గొన్నారు.