28 June, 2026 | 1:59 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

ఆఫ్ఘనిస్థాన్ తజికిస్తాన్ సరిహద్దుల్లో భూకంపం

20-04-2025 12:04 AM

రిక్టర్ స్కేల్‌పై 5.8గా నమోదు..

86 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం...

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో శనివారం మధ్యాహ్నం భూమి కంపించింది. కశ్మీర్, ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో దీని ప్రభావం కనిపించింది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్‌సీఎస్) ప్రకారం మధ్యాహ్నం 12.17 గంటలకు ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం 86 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు ఎన్‌సీఎస్ పేర్కొంది.