25-07-2025 12:54:14 AM
ములుగు,గోవిందరావుపేట జూలై24(విజయక్రాంతి): ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పసర గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ఆకస్మికంగా సందర్శించి గురువారం హాజరైన టీచర్ల వివరాలను రిజిస్టర్,అలాగే మధ్యాహ్న భోజనంకి సంబందించిన రిజిస్టర్ లని పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సూచించారు అనంతరం క్లాస్ రూంలకు వెళ్లి విద్యార్థులతో పలు అంశాల పైన మాట్లాడారు.
అందరికి యూనిఫామ్స్,నోట్ బుక్స్ వచ్చాయా, మధ్యాహ్న భోజనం బాగుంటుందా..? మెనూ ప్రకారం పెడుతున్నారా.? లేదా అని.. అలాగే ఫుడ్ కమిటీలో ఉన్న విద్యార్థులతో ప్రత్యేకంగా... భోజనం నాణ్యత గురించి ఆరా తీశారు.9వ,10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి పఠనా సామర్థ్యాలను పరిశీలించి వంద శాతం అందరూ హైఎస్ట్ మార్క్ లు వచ్చేలా కృషి చేయాల న్నరు. ఏఏ విద్యార్థులు ఏ సబ్జెక్ట్ ల్లో వీక్ గా ఉన్నారో ఒక్కో విద్యార్థిని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు వీక్ ఉన్న సబ్జెక్ట్ లను ఉపాధ్యాయులు రివిజన్ చేయాలన్నారు. ప్రతీ రోజూ విద్యార్థులు పాఠశాలకి వచ్చేలా మానటరింగ్ చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు సకల సౌకర్యాలను కల్పించడం జరిగిందని తెలిపారు.