calender_icon.png 21 June, 2025 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తలసేమియా వ్యాధి నివారణకు కృషి చేయాలి

21-06-2025 12:00:00 AM

ఉట్నూర్ ఐటీడీఏను సందర్శించిన రాష్ట్ర ప్రభారీ డిప్యూటీ సెక్రటరీ

అదిలాబాద్, జూన్ 20 (విజయక్రాంతి) : తలసేమియా సికిల్ సెల్ వ్యాధి నివారణకు కృషి చేయాలని రాష్ట్ర ప్రభారీ డిప్యూటీ సెక్రటరి గణేష్ నిరంజన్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్ లోని ఐటీడీఏ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సికిల్ సెల్ అనీమియా టెస్టింగ్ క్యాంపును ఆయన పరిశీలించారు. ముందుగా ఐటిడిఏ కార్యాలయానికి వచ్చిన గణేష్ నిరంజన్ ఐటీడీఏ పిఓ ఖుష్బూ గుప్త, సబ్ కలెక్టర్ యువరాజ్, ఇతర అధికారులు పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు.

అనంతరం ఇంద్రవెల్లి మండలం మారుతి గూడ పీవీటీజి హాబిటేషన్ లో నూతనంగా నిర్మిస్తున్న మల్టీపర్పస్ సెంటర్ ను రాష్ట్ర ప్రభారి డిప్యూటి సెక్రెటరీ గణేశ్ నిరంజన్ పరిశీలించారు. పీఎం జన్ మన్ లో మంజూరైన 60 లక్షల రూపాయలతో నిర్మించిన మల్టీ పర్పస్ సెంటర్ లో మల్టిపర్పస్ హాల్, సబ్ సెంటర్, క్లాస్ రూమ్, అంగన్వాడి సెంటర్, ఆఫీసర్స్ రూమ్స్, టాయిలెట్స్, కారిడారడ్స్ 6 గిరిజనుల సౌకర్యార్థం, వారి ఆరోగ్యం, మౌళిక వసతుల కల్పన, అభివృధ్ధి, శ్రేయస్సు కొరకు నిర్మించడం జరిగిందన్నారు. ఈ కార్యక్ర మంలో సంబంధిత శాఖ అధికారులు, ఆదివాసీలు,  గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.