calender_icon.png 21 June, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధుకు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు పరామర్శ

20-06-2025 11:22:05 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈనెల 19న జరిగిన దాడిలో తీవ్రగాయాలకు గురైన బిఆర్‌ఎస్వి నాయకుడు దగ్గుల మధును మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Former Minister Koppula Eshwar), మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు(మంచిర్యాల), దుర్గం చిన్నయ్య (బెల్లంపల్లి), బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ రావులు శుక్రవారం ఆస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనుచరులు దాడికి పాల్పడ్డారని, కాంగ్రెస్ నాయకులు బి ఆర్ ఎస్ నాయకులను టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు.