21-06-2025 12:00:00 AM
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్
కాగజ్ నగర్,జూన్ 20 (విజయ క్రాంతి): కాగజ్ నగర్ మున్సిపల్ వార్డులలో ఇంది రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అందజేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి పక్క ఇండ్లు నిర్మించాలని సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పంపిణి పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుంది అన్నారు.
ప్రజా ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేస్తున్నాం అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.