calender_icon.png 8 December, 2025 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల్లో మానసిక వికాసాన్ని పెంపొందించేందుకు కృషిచేయాలి

08-12-2025 07:45:18 PM

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

హనుమకొండ,(విజయక్రాంతి): జిల్లాలో ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో మానసిక వికాసాన్ని పెంపొందించేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్టూడెంట్ వెల్ నెస్ కార్యక్రమం పై వివిధ శాఖల అధికారులు,  స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమన్వయ సమావేశం సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విద్యార్థుల్లో మానసిక వికాసం, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే అంశాలను గురించి చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులలో మానసిక స్థైర్యాన్ని , ఆహార శైలి, అలవాట్లు, సురక్షిత వాతావరణం కల్పించాలని, విద్యా సంస్థల్లో విద్యార్థుల మానసిక వికాసం పెంపొందించేందుకు నిపుణులతో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించాలన్నారు.

విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించే అంశాలను తెలియజేసెలా మెడికల్ ఆఫీసర్స్,  పాఠశాలలు, గురుకులాల విద్యాలయాల నుండి ఒక్కో ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థుల మానసిక మానసిక స్థితిని నాలుగు కేటగిరీల వారిగా రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ గా గుర్తించి సమస్యాత్మక జోన్ లో ఉన్న పిల్లలకు సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ లతో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా కౌన్సిలింగ్ నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో  డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారి గోపాల్, డిటిడివో ప్రేమకళ, సాంఘిక సంక్షేమ శాఖ డిడి నిర్మల, జిల్లా మైనార్టీ సంక్షేమఅధికారి గౌస్ హైదర్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్, గురుకుల విద్యాలయాల డిసిఓలు  ఉమా మహేశ్వరి, ప్రసాద్, సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రహసిత్, ఆర్సీఓ  రాజ్ కుమార్, ఏఎంవో సుదర్శన్ రెడ్డి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కజాంపురం దామోదర్,ఇతర అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.