12-06-2025 10:20:26 PM
బెల్లంపల్లి ఏరియా ముఖ్య నాయకుల సమావేశం..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బెల్లంపల్లి ఏరియాలో ఐఎన్టియుసి బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆ సంఘం నాయకులు కోరారు. బెల్లంపల్లి ఏరియా కేంద్ర కార్యాలయం గోలేటిలో గురువారం ఐ ఎన్ టి యూసి ముఖ్య నాయకుల సమావేశం ఏరియా వైస్ ప్రెసిడెంట్ పేరం శ్రీనివాస్(Area Vice President Param Srinivas) అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సెంట్రల్ కమిటీ సెక్రెటరీస్ సంఘం ప్రకాష్ రావు, అందే వీరస్వామి, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఏరియా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ... అందరూ కలిసికట్టుగా యూనియన్ బలోపేతానికి కృషి చేయాలన్నారు.
కార్మికుల పక్షాన ఐ ఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జానక్ ప్రసాద్ వర్క్స్ పైన ఇన్కమ్ టాక్స్ రద్దు, కార్మికుల సొంతింటి పథకం కోసం కృషి చేస్తున్నరని తెలిపారు. ఇప్పటికే కార్మికుల సదుపాయం కోసం డిస్పెన్సరీ నుంచి డైరెక్ట్ గా కార్పొరేట్ హాస్పిటల్ కి రెఫెర్ చేయడం జరుగుతుందన్నారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమన్నారు. సింగరేణి కార్మికులు ప్రమాదవశాత్తు ప్రమాదం సంభవించినప్పుడు ఒక కోటి 20 లక్షలు కార్మికుడికి అందేలా, అలాగే, కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాట కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పించిన ఘనత జనక్ ప్రసాదు దని వెల్లడించారు.
గత ఎన్నికల్లో ఏఐటీయూసీకి మద్దతిచ్చి గెలిపించిన టీబీజీకేఎస్ నాయకులు ఇవాళ ఏఐటీయూసీనే హక్కులు సాధించాలని డిమాండ్ చే చేస్తూన్న నక్కజిత్తుల పార్టీలను నమ్మవద్దని వెల్లడించారు. రాబోయే రోజుల్లో వారి మధ్య స్నేహం ఇలానే కొనసాగుతుందని జోష్యం చెప్పారు. సమావేశంలో ఏరియా సెక్రెటరీ బూర శ్రీనివాస్,సోకాల శ్రీనివాస్, మాసాడి నారాయణ, ఖైరగూడ ఫిట్ సెక్రటరీ భాస్కరాచారి, సి హెచ్ పి ఫిట్ సెక్రెటరీ దుండ్రా రవికుమార్, కుమారస్వామి, రామ్మోహన్, వామన్, ఆడే శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు.