12-06-2025 10:22:33 PM
ఆర్డీవో వేణుమాధవ్ రావు..
పెన్ పహాడ్: భూ సమస్యలతో సతమత మవుతున్న రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం 'భూభారతి' పథకం తీసుకొచ్చిందని ప్రతి ఒక్కరు ఈ పథకం సద్వినియోగం చేసుకోవాలని ఆర్డిఓ వేణు మాధవరావు(RDO Venu Madhavarao) రైతులను కోరారు. గురువారం సూర్యాపేట జిల్లాపెన్ పహాడ్ మండల పరిధిలోని ధూపహాడ్ గ్రామంలో తహసీల్దార్ లాలూ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును ఆర్డీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడున్న ప్రజలను ఏ సమస్యలపై దరఖాస్తులు చేసుకున్నారని అడిగి తెలుసుకున్నారు.
వారి వద్ద దరఖాస్తు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సును నిర్వహిస్తున్నది సుధీర్ఘకాలంగా పరిష్కారం కాని రెవెన్యూ సమస్యలు పరిష్కరించుకునేందుకు భూభారతిని తీసుకువచ్చిందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలను అందజేసేందుకు ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. భూ భారతి చట్టం ప్రజలకు, రైతులకు ఉపయోగపడేలా ఉందన్నారు. త్వరతిగతిన మీ సమస్యలను పరిష్కరించడమే మా ధ్యేయం అన్నారు. రెవెన్యూ సిబ్బంది మీకు అండగా ఉంటూ మీ సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు.
రేషన్ దుకాణం తనిఖీ
ధూప హడ్ గ్రామంలో రేషన్ దుకాణంలో సన్న బియ్యం మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయడం పై ఆర్డీఓ తనిఖీలు నిర్వహించారు. క్షత్రస్థాయిలో ఎం జరుగుతుందో ఆడిగి తెలుసుకున్నారు. ధరల దుకాణాలు సమర్థవంతంగా పనిచేయాలని లబ్ధిదారులు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువుల పంపిణీ జరగాలని ఆయన ఆదేశించారు. లబ్ధిదారులు లేవనెత్తిన ఏవైనా సమస్యలు లేదా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. చౌక దుకాణాల పనితీరును పర్యవేక్షించడం, పిడీఎస్ ప్రయోజనాలు పారదర్శకంగా, సమర్థవంతంగా ఉద్దేశించిన లబ్ధిదారులకు చేరేలా చూడటం కోసం నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు.. కార్యక్రమంలో తహసీల్దార్ లాలూ నాయక్, ఆర్ ఐ రంజిత్ రెడ్డి, ఏ ఆర్ ఐ అజీజ భేగం, సీనియర్ ఆస్టెంట్ రాధ తదితరులు పాల్గొన్నారు.