25-06-2025 11:40:32 PM
ఎమ్మెల్యే అహ్మద్ బలాల..
మలక్పేట్ (విజయక్రాంతి): నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తామని మలక్పేట్ ఎమ్మెల్యే అన్నారు. బుధవారం ఎమ్మెల్యే అహ్మద్ బలాల(MLA Ahmed Balala) ముసరాంబాగ్ డివిజన్లో బాల దానమ్మ బస్తి, సైదాబాద్ డివిజన్ పరిధిలోని అస్మాన్ ఘడ్ ప్రాంతాలలో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. సందర్భంగా బాలదానము బస్తీలో మంచినీటి సమస్య ఉందని, లో ప్రెజర్ తో పైప్ లైన్ ద్వారా నీళ్ల సరఫరా సక్రమంగా రావడం లేదని స్థానికులు ఎమ్మెల్యేకు వివరించారు. అదేవిధంగా డ్రైనేజ్ పైప్ లైన్ పేర్కొన్నారు. ఆస్మాన్ గాడ్ లో అక్కడక్కడ రోడ్లు దెబ్బతిన్నాయని, విద్యుత్ స్ట్రీట్ లైట్లు సక్రమంగా వెలగడం లేదని స్థానికులు తెలిపారు.
ఎమ్మెల్యే అహ్మద్ బలాల స్పందిస్తూ లో ప్రెజర్ సమస్యను అధిగమించేందుకు తగిలిన చర్యలు చేపట్టాలని జలమండలి అధికారులను ఆదేశించారు. ఆస్మాన్ ఘడ్ లో పనిచేయని స్ట్రీట్ లైట్లు తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. కాలనీ, బస్తీలలో ప్రజలకు కావాల్సిన మెరుగైన సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చొరవ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.