calender_icon.png 27 September, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పటాన్ చెరు డివిజన్ మౌలిక వసతుల కల్పనకు కృషి

27-09-2025 09:17:04 PM

3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే జిఎంఆర్ 

పటాన్ చెరు: ప్రభుత్వ సహకారం.. ప్రజల భాగస్వామ్యంతో నియోజకవర్గ కేంద్రమైన పటాన్ చెరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ, సీతారామపురం కాలనీ, శాంతినగర్ కాలనీ, గౌతమ్ నగర్ కాలనీ, కృషి డిఫెన్స్ కాలనీలలో మూడు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, బీటి రోడ్డు, వరద నీటి కాలువల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పాటవుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.