calender_icon.png 25 June, 2025 | 2:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

8వ తరగతి విద్యార్థి అదృశ్యం

25-06-2025 09:58:45 AM

మొయినాబాద్:  మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని(Moinabad Municipality Area) చిల్కూర్‌లోని సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థి కె. ఆశ్రిత్ (13) అదృశ్యం అయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటకు చెందిన అనిల్ సోమవారం స్కూల్ లో చేరాడు. మంగళవారం మధ్యాహ్నం 2.20 గంటల ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. గమనించిన స్కూల్ ప్రిన్సిపల్ దేవేందర్ చుట్టు పక్కల ప్రదేశాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.