calender_icon.png 25 June, 2025 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యథేచ్ఛగా రేషన్ బియ్యం దందా

25-06-2025 02:00:07 AM

  1. బ్రాండెడ్ పేర్లతో సన్న బియ్యం విక్రయాలు
  2. --     80 క్వింటాళ్ల  బియ్యం పట్టుకున్న పోలీసులు 
  3. పథకాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: ఎస్పీ అఖిల్ 

అదిలాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): ప్రభుత్వం పేద ప్రజలకు రేషన్ షాప్‌ల ద్వారా అందిస్తున్న  సన్న బియ్యాన్ని అక్రమార్కులు తమదైన శైలిలో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పలువురు వ్యాపారు లు రాయితీ సన్న బియ్యాన్ని పలు బ్రాండెడ్ బియ్యం సంచులలో నింపి ప్రజలకు అధిక ధరకు విక్రయిస్తూ మోసం చేస్తున్న దందా ను పోలీసులు బట్టబయలు చేశారు.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌కు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక పోలీస్ బృందం ఏర్పాటు చేసి సివిల్ సప్లై అధికారులతో కలిసి తనిఖీలు చేయించారు. దింతో శివాజీ చౌక్‌లోని ఇద్దరి వ్యాపారుల దుకాణాలలో దాదాపు 80 క్వింటాళ్ల రాయితీ సన్న బియ్యాన్ని పట్టుకున్నారు. అక్రమ దందాకు పాల్పడుతున్న రజిత కిరణ షాప్ యజమాని గూగుల్వర్ రాజేశ్వర్, ఆంధ్ర కిర ణ షాప్ యజమాని షేక్ అయూబ్, చిలుకూరి లక్ష్మీ నగర్‌కు చెందిన షేక్ అస్లాంపై కేసు నమోదు చేశారు. 

ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న పథకాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రతి ఒకరిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరిం చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాయితీ బియ్యాన్ని అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుం డా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ రాయితీ బియ్యం మార్కెట్లో చలామణిలో ఉన్న మంచి బ్రాండ్లు జై శ్రీరామ్, గోల్డెన్ సైకిల్ బ్రాండ్, సూర్య తేజ, మధురం, దీపం, గీతాంజలి, వైట్ ప్లాటినం, శ్రీ దత్త అనే పేర్లతో బ్యాగులను సృష్టించి అందులో పీడీఎస్ రైసు నింపి, మిషన్‌తో సీల్ వేసి, అధిక ధరలకు విక్రయిస్తూ, ప్రజలను బురిడీ కొట్టిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ  జీవన్ రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, సివిల్ సప్లయ్ అధికారి వాజిద్, సీఐ సునీల్ కుమార్, ఎస్సై అశోక్ పాల్గొన్నారు.